Draksharamam Shiva Lingam Vandalized: ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. పోలీసులు 6 బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆలయంలో ధ్వంసమైన లింగం స్థానంలో కొత్త లింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగం ధ్వంసం చేసింది ఎవరు.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.