Nandyal Hyacinth Buffaloes Died: నంద్యాల జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుందూ నదిలో గుర్రపు డెక్కలో చిక్కుకొని ఒక రైతుకు చెందిన 13 గేదెలు మరణించాయి. పాడి గేదెలపై ఆధారపడి జీవిస్తున్న ఆ రైతు కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ దుస్థితికి కారణమైన గుర్రపు డెక్కను తొలగించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు?