ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు వద్ద టిప్పర్ అదుపుతప్పి బైక్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రోడ్డుపై ఉంచి బారీకేడ్ల కారణంగా టిప్పర్ అదుపు తప్పి ఉండొచ్చనే వాదనలు కూడా వస్తున్నాయి.