నంద్యాలలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. జ్యువెలరీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే.. భారీగా బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. ఏకంగా రూ.16.6 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులు గుర్తించారు. అయితే నగలను ప్రదర్శన కోసం ఉంచిన ఉద్యోగులు.. చేతి వాటం ప్రదర్శించి.. వాటిని కొట్టేశారని గుర్తించారు. అందులో కొంత సొత్తును విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.