మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని.. తుపాకులు పట్టిన వారితో చర్చలు జరపబోమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరడం డ్రామా అని విమర్శించారు. కులగణన చారిత్రాత్మకమని.. కాంగ్రెస్ కులగణన బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. దేశంలోని రోహింగ్యాలపై కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు.