PM e Drive Bids Telangana: కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మేఘా, గ్రీన్సెల్ సంస్థలు అర్హత సాధించాయి. అద్దెపై చర్చలు జరుగుతున్నాయి. పాత డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ప్రయాణికులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. మరీ ముఖ్యంగా బస్సుల్లో రద్దీ తగ్గి.. హాయిగా ప్రయాణం చేయవచ్చని.. అలానే ఆర్టీసీకి ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది అంటున్నారు.