మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో కుట్రలు ఉన్నాయని, రైతుల పక్షాన నిలిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. తన పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, పోలీసులు సహకరించడం లేదని అన్నారు. తన పర్యటన పూర్తయిన తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్పై దాడిని ఖండించారు. చంద్రబాబు నటన ఎన్టీఆర్ను మించిపోయిందని, పోలీసులు తన భద్రతకు కాకుండా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.