Heroine Meenakshi Chaudhary about Tirumala: తిరుమలలో టీటీడీ సిబ్బంది ఏర్పాట్లపై సినీ నటి, హీరోయిన్ మీనాక్షిచౌదరి ప్రశంసలు కురిపించారు. మీనాక్షి చౌదరి ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విశేషాలను పంచుకున్న మీనాక్షి చౌదరి.. తిరుమలకు ఎప్పుడు వెళ్లినా తొలిసారిగా వెళ్లిన అనుభూతి కలుగుతోందన్నారు. తిరుమలలో అడుగుపెట్టగానే టెన్షన్, స్ట్రెస్ అన్నీ మాయమవుతాయని.. ప్రశాంతతతో శ్రీవారిని దర్శించుకుంటానని వివరించారు. భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను కూడా ప్రశంసించారు.