మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అంటూ తనపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై కేసీఆర్కు తెలియదని, అందుకే మీడియా ద్వారా చెబుతున్నానని అన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదని కవిత అన్నారు.