Narasaraopet Bikes Theft Midnight: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రజల్ని కొత్త టెన్షన్ వెంటాడుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలతో వారంతా ఆందోళనలో ఉన్నారు. సీసీ ఫుటేజ్ చూస్తే వారికి అసలు సంగతి తెలియలేదు. కొంతకాలంగా దొంగలు బైక్లను ఎత్తుకెళుతున్నారు.. ఏకంగా ఆటోను కూడా తీసుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీరియస్గా తీసుకుని నిఘాను పెంచారు. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.