సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ఏపీ జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్.. చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నంలో.. అమరులయ్యారు. మురళీ నాయక్ కుటుంబసభ్యులకు సైన్యం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. అయితే దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందడం గర్వంగా ఉందని మురళీ నాయక్ కుటుంబసభ్యులు చెప్తున్నారు. చస్తే దేశం కోసమే చస్తానని ఎప్పుడూ చెప్పేవాడని గుర్తు చేసుకుంటున్నారు.