వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అయితే తన జోలికి వస్తే అఫెన్సివ్ గేమ్ ఆడటం తనకూ తెలుసన్నారు. తన లక్ష్యం వైఎస్ జగన్ కాదని.. వైసీపీ నేతల తీరు కారణంగా సంజాయిషీ, సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని షర్మిల అన్నారు. వైసీపీ నేతలను కుక్కు అని తాను అనలేదని.. కానీ వారే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కడపలో వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి.