స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆమె కొనియాడారు. హైదరాబాద్లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఏఐసీసీ పెద్దలను కూడా కోరినట్లు, వారికి లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.