Dastagiri Wife Comments: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా తన భర్తను చంపేస్తామంటూ కొందరు తనను బెదిరించారని ఆయన భార్య షబానా ఆరోపించారు. తనపై మల్యాలలో ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారని దస్తగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు మహిళలు తన ఇంట్లోకి చొరబడి.. ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ప్రశాంతంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం పాలనలో.. శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు