AP Minister Savitha Counters Ysrcp: తల్లికి వందనం నిధులపై వైఎస్సార్సీపీ ఆరోపణలను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. లోకేష్ జేబుల్లోకి నిధులు వెళ్లాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే వైఎస్ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే, ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అందిస్తున్నామని, ఇది చంద్రబాబు, పవన్, లోకేష్ కృషితోనే సాధ్యమైందని ఆమె అన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె విమర్శించారు.