ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. తన రాజీనామాను ఆమోదించడం లేదంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజీనామా చేసి 9 నెలలు గడుస్తున్నా మండలి ఛైర్మన్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని మండలి ఛైర్మన్ తరుఫు న్యాయవాదులను ఆదేశించింది.