ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో తనను పోల్చడాన్ని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తోసిపుచ్చారు. షర్మిలతో తనకు పోలిక లేదని.. ఆమె నేపథ్యం, తన నేపథ్యం వేర్వేరని చెప్పుకొచ్చారు. కేసీఆర్, జగన్ లెక్కన విజయవంతమైన వారి నుంచి తాను స్ఫూర్తి పొందుతానని.. వారి తరహాలోనే సక్సెస్ అవుతానని కవిత చెప్పుకొచ్చారు. మరవైపు షర్మిల తరహాలోనే కవిత కూడా సొంతంగా పార్టీ పెట్టడంతో ఇరువురు మధ్య సోషల్ మీడియాలో పోలిక తీస్తున్న సంగతి తెలిసిందే.