బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారం ఏపీలోని పలు జిల్లాలలో వానలు పడతాయని వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.