ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసిన పనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇదేం పని అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును గుర్తించకుండా వ్యవహరించారని విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రజానీకానికి బీజేపీ అధిష్ఠానం క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు నారా లోకేష్కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భారతదేశ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఇందులో తెలంగాణ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూపటంతో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.