Nara Lokesh On Minister Narayana Teaching: విజయవాడలో గురుపూజోత్సవంలో భాగంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. 175 మంది ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. లోకేష్ తన గురువులను స్మరించుకున్నారు. గతంలో చంద్రబాబు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారని, సెప్టెంబరులో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. పేరెంట్-టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించిందని ఆయన వెల్లడించారు. లోకేష్ చదువు గురించి చంద్రబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.