రాష్ట్రంలోని బీసీ, ఓబీసీ, కాపు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో టైలరింగ్ మీద శిక్షణ అందించి.. అనంతరం కుట్టుమిషన్లు అందిస్తున్నారు. అయితే కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో అవినీతి జరుగుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఫోటోలు, పోస్టులు పెడుతున్నారు. తాజాగా కుట్టుమిషన్లకు పసుపు రంగు వేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ కాగా.. ఏపీ మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు.