తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, ఎస్సీ వర్గీకరణ వంటి బిల్లులు ఉన్నాయి. అసెంబ్లీలో ఏఐఎంఐఎం సభ్యులు స్పీకర్ తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అంశంపై మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.