తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుకు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి, నాగార్జున సాగర్ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో స్నాన ఘట్టాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది.