నిజామాబాద్లో రాత్రికి రాత్రే రెండు ఏటీఎంలను టార్గెట్ చేసి సుమారు 30 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దొంగల వ్యవహారం కలకలం రేపుతోంది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.