నిర్మల్ జిల్లాలో ఆటో డ్రైవర్ సాయి కుమార్ నిజాయితీ చాటుకున్నారు. రోడ్డుపై దొరికిన రూ. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు కలిగిన సంచిని పోగొట్టుకున్న మహిళకు తిరిగి ఇచ్చాడు. పేదరికంలోనూ తన నిజాయితీని నిరూపించుకున్న సాయికుమార్ మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తులు అతడిని అభినందించి సత్కరించారు.