ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తి కనిపించడం లేదు. దీంతో అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతని కోసం గాలిస్తున్నారు. కాకినాడ విషాద ఘటనను మరువకముందే ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.