Jee And Neet Academy In Nimmakuru Aprjc: ఏపీ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని అధికారులను, ఉపాధ్యాయులకు సేచించారు. రాష్ట్రంలో 10 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలిపింది. నిమ్మకూరులో ఐఐటీ జేఈఈ/నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదించారు.