కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద ,మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి ముందడుగు వేసింది. గుండె వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక వైద్య శిబిరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 21వ తేదీ వరకు కొనసాగనుంది.