డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. అదనంగా పెంచాలనుకుంటున్న సీట్లలో సగం జనాభా ప్రాతిపదికన.. మిగిలిన సగం ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుత విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.