నియోజకవర్గాల పునర్విభజన.. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 175, ఎంపీ స్థానాలు 25..?

6 months ago 22
తెలంగాణలో త్వరలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగనుంది. బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరో ఆరు నెలల్లో జనగణన పూర్తయ్యాక పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 119 నుండి కనీసం 153కి, పార్లమెంట్ స్థానాలు 17 నుండి 23-25 వరకు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా రాజకీయ సుస్థిరత సాధించాలని కేంద్రం భావిస్తోంది. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ మార్పులతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
Read Entire Article