ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అంత సులువేమీ కాదు. అందునా అదనపు నైపుణ్యాలు లేకుండా జాబ్ సంపాదించాలంటే చాలా కష్టం. సంస్థలు కూడా అదనపు నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పోటీకి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అయితే ఇది అనంతపురం జిల్లాకు మాత్రమే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మెప్మా అధికారులు కోరుతున్నారు.