ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వివరాలను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ శిక్షణ కేంద్రంలో ఆరు నెలల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.