Fish Canteen at Nampally: హైదరాబాద్లో చేపల వినియోగాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే మాసబ్ట్యాంక్లో ఒక ఫిష్ క్యాంటీన్ ఉండగా, తాజాగా నాంపల్లిలో రెండో క్యాంటీన్ను ప్రారంభించారు. దీని ద్వారా నగరవాసులు తక్కువ ధరకే రుచికరమైన చేపల వంటకాలను ఆస్వాదించవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.