నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో నియోజకవర్గాలలో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవంబర్ 29వ తేదీ మంగళగిరిలో జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి పీజీ వరకూ చదివిన 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.