2012లో ఢిల్లీ నిర్భయ ఘటన జరిగిన రెండు రోజులకే సిద్ధిపేటలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నరేందర్కు 12 ఏళ్ల తర్వాత జీవిత ఖైదు పడింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసును అణచివేసే ప్రయత్నం చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని, ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.