తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. గతంలో ఆస్పత్రిలో చేరిన ఆయన, వైద్యుల సూచన మేరకు మరోసారి పరీక్షల కోసం వచ్చారు. హరీష్ రావు, కేటీఆర్లు ఆయన వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణకు హాజరైన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత హై బ్లడ్ షుగర్తో ఆస్ప్రతిలో చేరిన కేసీఆర్.. మళ్లీ ఇవాళ టెస్టులకు వచ్చి ఇంటికి వెళ్లారు.