రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు కోల్పోయేలా చేసింది. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నచ్చజెప్పాలని ప్రయత్నించినా.. భార్య తీరు మారకపోవగా చచ్చిపో అని అనటంతో ఆవేదనకు లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.