అనంతపురం జిల్లాలోని ముద్దలాపురం గ్రామ ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చిందే లేదు. ఇన్నేళ్లుగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోతుందా అని ఆ ఊరి జనం చూసిన ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు ముద్దలాపురానికి ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి బస్సు సర్వీసు విషయాన్ని స్థానికులు తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ముద్దలాపురం కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. అమిలినేని సురేంద్రబాబు ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు.