అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ ఆయాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసిన ప్రభుత్వం.. అందులోని అంగన్వాడీ ఆయాలకు, అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించింది. దీంతో వారి వేతనాలు కూడా నాలుగు వేల వరకూ పెరగనున్నాయి. ఈ మేరకు జిల్లా ఐసీడీఎస్ పీడీ ఉత్తర్వులు జారీ చేశారు.