మంచిర్యాల ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఏడాదిన్నరకాలంగా వారు చేస్తోన్న డిమాండ్కి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా సికింద్రాబాద్-నాగ్పూర్ వందే భారత్ రైలు ఇక మీదట మంచిర్యాలలో కూడా ఆగనుంది. దీని కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఏడాది కాలంగా చేస్తోన్న కృష్టి ఫలించింది. మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ కోసం వంశీకృష్ణ.. ఏడాదిన్నర కాలంగా రైల్వే శాఖ మంత్రిని, ఇతర అధికారులను కలిసి విజ్ఞప్తి చేయడంతో తాజాగా అందుకు అనుమతి లభించింది. ఆ వివరాలు..