నెల్లూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం.. ప్రసూతి, పిల్లల వార్డులో మంటలు..

1 month ago 10
నెల్లూరు సర్వజనాసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నెల్లూరు జీజీహెచ్‌లోని చిన్నపిల్లలు, ప్రసూతి వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు చెలరేగటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో వార్డులు మొత్తం చీకట్లతో నిండిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐసీయూలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
Read Entire Article