Nellore B Pharmacy Student Murder: నెల్లూరు నగరంలో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ ఆఫీస్ సెంటర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కారణంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.