నెల్లూరు జిల్లాలో యాక్సిస్ బ్యాంకు కేంద్రంగా కుబేర సినిమా తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు కేటుగాళ్లు గిరిజనులను నమ్మించి, వారి పేరు మీద రూ.10.60 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఫేక్ కంపెనీలు సృష్టించి, గిరిజనులను ఉద్యోగులుగా చూపి లోన్లు కొట్టేశారు. అసలు విషయం తెలియని గిరిజనులు బ్యాంకు నోటీసులు చూసి షాక్ అవుతున్నారు. ఈ స్కామ్ వెనుక బ్యాంక్ ఉద్యోగుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.