తెలంగాణలో రానున్న ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలపై ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు వానాకాలం పంటలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.