ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా నిధుల పంపిణీలో సమస్యలు, రాష్ట్ర క్రీడా పాలసీపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపు, జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుపైనా చర్చించనున్నట్లు సమాచారం.