జైభీమ్ రావ్ భారత్ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ తనకు ఆఫర్ చేసిందని.. ఆ ఆఫర్ అంగీకరించి ఉంటే.. మంత్రిని అయ్యేవాడినని అన్నారు. విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన జడ శ్రవణ్ కుమార్ రఘురామకృష్ణరాజును విమర్శిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలిట మహావిష్ణువు అని నారా లోకేష్ స్వయంగా అన్నారని.. అప్పట్లో తమ పోరాటం కారణంగానే ఇప్పుడు కూటమి నేతలు అధికారం అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు.