బీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ముతో 2018లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ నిధులు ఇచ్చారని, కేసీఆర్, కేటీఆర్ ఓటమికి కుట్ర చేశారని ఆరోపించారు. దుబ్బాక, హుజురాబాద్ ఓటములకు కూడా హరీషే కారణమని పార్టీ నుంచి తన సస్పెన్షన్కు ఆయనే కారణమని కవిత అన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనని.. తెలంగాణ జాగృతి కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.