ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపింది. పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని, అవసరమైతే వంద లేఖలు రాస్తానని కవిత స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని, బీఆర్ఎస్ ఎంపీల్లో కొందరు కోవర్టులున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను అరెస్ట్ చేసే సమయంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని కవిత తెలిపారు. బీజేపీతో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నాలను తాను అడ్డుకున్నానని ఆమె పేర్కొన్నారు.