పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం. ఇప్పటికే సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయగా.. 10 మందిలో ఒకరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను పార్టీ మారలేదని.. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. కాబట్టి తనపై దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని కోరారు.