వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. పులివెందుల పర్యటనలో అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి. వైసీపీ హయాంలో అరటి పంటకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేయగలరా అని సవాల్ విసిరారు.